మీటూ ఉద్యమం కాస్తా చల్లబడినట్లు కనిపంచినప్పటికి ఎక్కోడో ఓ చోట మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చ వస్తునే ఉంది.తాజాగా మరో నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.నటి నేహా సక్సేనా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆమె ఓ కార్యక్రమం నిమిత్తం యూఏఈలోని అబుదాబికి వెళ్లింది. అక్కడ ఆమెను గమనించిన ఎల్సన్ దోహీలక్షన్ అనే వ్యక్తి తన కోరిక తీర్చాల్సిందిగా నేహా పీఆర్ మేనేజర్ కు సందేశం పంపాడు.
దీంతో ఈ వ్యవహారాన్ని మేనేజర్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వీటి స్క్రీన్ షాట్లు తీసిన నటి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తనకు క్షమాపణ చెబుతూ బహిరంగ లేఖ రాసే వరకూ తాను ఊరుకోబోనని స్పష్టం చేసింది.అయితే ఈ ఘటనపై సదురు వ్యక్తి తన హ్యాక్ అయిందని చెబుతున్నాడు.ఫోన్ హ్యాక్ అయిందని ఎల్సన్ కొత్త నాటకాలు ఆడుతున్నాడని నేహా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్సన్ డ్రామాను అతని తల్లిదండ్రులు సైతం నమ్ముతున్నారని వాపోయింది.