టాలీవుడ్ లో యంగ్ హీరో మంచు మనోజ్ కి, యంగ్ హీరో రాజ్ తరుణ్ కి మధ్య ఆసక్తికర గొడవ జరుగుతోంది. ఈ యంగ్ హీరోలు తమ సినిమాలతో ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్దం అవుతున్నారు. మంచు మనోజ్ ఎటాక్, శౌర్య వంటి రెండు ప్లాపుల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు అనే రెండు సినిమాలను సిద్దం చేస్తున్నాడు.
ఈ రెండు చిత్రాల్లో గుంటూరోడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ముందుగా ఈ చిత్రంను ఈ నెల 24న విడుదల చేయాలనుకున్నారు. అదే రోజు సాయిధరమ్ తేజ్ విన్నర్ కూడా ఉంది. దాంతో గుంటూరోడు సినిమా విడుదలను వాయిదా వేసి.. మార్చి 3న విడుదల చేస్తున్నట్టు కొత్త తేదీని ప్రకటించారు.
సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి డీజే వసంత్ సంగీతం అందించగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఇక అదే రోజున హ్యాట్రిక్ హిట్ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్తరుణ్ నటించిన కిట్టుగాడు ఉన్నాడు సినిమా కూడా విడుదల అవుతోంది. మరి ఈ ఇద్దరు యంగ్ హీరోల పోటీలో ఎవరు మంచి విజయం దక్కించుకుంటారో చూడాలి.
Related