అలా ఎలా సినిమాతో తెలుగులో పరిచయం అయిన హీరోయిన్ హేబా పటేల్. రాజ్ తరుణ్ సరసన కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించి టాలీవుడ్లో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయ్యింది ఈ భామ. ఈ మూవీతో సక్సెస్ ఫుల్ జోడి అనిపించుకున్న రాజ్ తరుణ్ హేబాలు.. తర్వాత ఈడో రకం ఆడో రకం సినిమాలో మరో సారి కలిసి నటించారు.
ఈ రెండు చిత్రాల్లో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడో సినిమాలో కూడా నటించారు. వీరిద్దరు కలిసి నటించిన మూడో సినిమా ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో అలరించనున్నాడు రాజ్ తరుణ్. ‘
నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో అశ్విన్, పార్వతీషం, నోయల్ లు హేబా బాయ్ ఫ్రెండ్స్ గా నటిస్తుండగా, క్లైమాక్స్ లో హేబాను పెళ్లిచేసుకునే వరుడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ముందుగా హెబా చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ను మెయింటింగ్ చేస్తుందట. చివరకు ఆమె క్లైమాక్స్లో రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకొని వాళ్లకు షాక్ ఇస్తుందట. ఈ సినిమాతో ఈ జోడికి హ్యాట్రిక్ సక్సెస్ కొడుతుందేమో చూడాలి.
Related