మొన్నటి మొన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. మోహన్ బాబు ఒక్కసారిగా ఇలా చంద్రబాబుపై కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 2017-2018 సంవత్సరాలకు గాను విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించలేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పారు మోహన్ బాబు. ఏదో తనకు బిక్షం
వేసినట్లుగా కొంత వేశారని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అయితే తాజాగా మోహన్ బాబు కొడుకు , హీరో మంచ విష్ణు కూడా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు.
తమ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో నాన్నా మోహన్ బాబు చేసిన కామెంట్స్కు తన మద్దతు తెలిపాడు మంచు విష్ణు. చంద్రబాబు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని , వ్యక్తిగతంగా కలిసిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు మంచు విష్ణు. వేరే ఇంజనీరింగ్ కళాశాలకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు సకాలంలోనే చెల్లిస్తున్నారని ,కావాలంటే ఆధారలతో
సహా ఇది నిరుపిస్తామని మంచు విష్ణు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్స్ టైంకి అందిస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మంచు ఫ్యామిలీ వచ్చే ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మంచు లక్ష్మీని వచ్చే ఎన్నికలలో వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేయించాలని మోహన్ బాబు ఆలోచన చేస్తున్నాడట. దీనిలో భాగంగానే తండ్రి, కొడుకులు చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేస్తున్నారట.
- Advertisement -
చంద్రబాబుపై మంచు విష్ణు విమర్శలు చేసింది అందుకేనా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -