Wednesday, May 8, 2024
- Advertisement -

తమన్ బదులుగా రానున్న మణిశర్మ

- Advertisement -

1992లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘రాత్రి’ సినిమా నుంచి ఈ మధ్యనే 2018 లో విడుదలైన ‘దేవదాసు’ సినిమా వరకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పటికే చాలా బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తన ఖాతాలో బోలెడు చార్ట్ బస్టర్ లు నమోదు చేసుకున్న ఈ సంగీత దర్శకుడు తాజాగా ఒక యువ సంగీత దర్శకుడి స్థానాన్ని రీప్లేస్ చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు ఎస్.ఎస్.తమన్. వాషింగ్టన్ డీసీ లో జరగబోతున్న తానా 2019 మ్యూజికల్ నైట్ నీ తమన్ స్వయంగా ఆర్గనైజ్ చేయాల్సింది.

కానీ ప్రస్తుతం ఎస్.ఎస్ తమన్ చేతిలో బోలెడు సినిమా ప్రాజెక్టులున్నాయి. ‘వెంకీ మామ’, బన్నీ త్రివిక్రమ్ సినిమా, ‘డిస్కో రాజా’ వంటి చాలా సినిమాలకు సంగీతాన్ని అందించనున్నారు తమన్. ఈ నేపథ్యంలో ఇన్ని సినిమాలతో బిజీగా ఉండటం వలన తమన్ తానా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తానా వారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మణిశర్మ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయనున్నారు. సునీత, కౌసల్య, హేమ, దీపు, హేమచంద్ర, శ్రీకృష్ణ వంటి ప్రముఖ సింగర్ లు ఈవెంట్లో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ తానా 2019 కి చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -