మెగా – నందమూరి హీరోలు మధ్య పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ఇది గత ఇరవై సంవత్సరాల నుండి వస్తున్న అనవాయితి.చిరంజీవి,బాలకృష్ణల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది.మొన్న జరిగిన సంక్రాంతికి జరిగిన పోటీలో కూడా చిరంజీవి ,బాలకృష్ణలు పోటీ పడ్డారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు, కోట్లటాలు బాగా జరిగేవి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ఇప్పుడు హీరోలు ఒకరి సినిమాల పై ఒకరు ప్రశంసలు చేస్తున్నారు.
విషయం ఏమిటంటే …రంగస్థలం మీదకు సావిత్రి వస్తుందనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడు. ఇందులో పెద్దగా కన్ ఫ్యూజ్ ఏమీ లేదు. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లోని రంగస్థలం మార్చి 29న విడుదలవుతోంది. ఇదిపక్కా. టీజర్ తో హల్ చల్ చేసిన హీరోయిన్ సావిత్రి బయోపిక్ మహానటి కూడా 29నే వస్తుందని ప్రకటించారు. దాంతో ఆ రెండు సినిమాలకు పోటీ వుంటుందని అంతా అనుకున్నారు.
కానీ మహానటి నిర్మాతలు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వారం ఇటుగానో, అటుగానో విడుదల చేయాలని ఇప్పుడు వాళ్లు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే మరో సినిమా మాత్రం 29కి డిసైడ్ అయిపోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే చిత్రాన్ని 29న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.కొత్త దర్శకుడు ఉపేంద్ర అదించిన ఈ చిత్రంలో కాజల్ కధానాయిక. సినిమా సబ్జెక్ట్ బాగా వచ్చింది. మూడు వంతులు పూర్తయిన సినిమా రఫ్ చూసుకున్నాక పూర్తి భరోసా వచ్చింది. దీంతో విడుదల డేట్ ను మార్చి 29కి లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అంటే సమ్మర్ ప్రారంభంలోనే మెగా, నందమూరి హీరొల సినిమాలు ఢీ అంటే ఢీ అంటాయన్నమాట.