Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా బ్రదర్!

- Advertisement -

ఈ మద్య సెలబ్రెటీలు కొత్త కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ పాన్ ఇండియా మూవీస్ పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఓ వైపు వెండి తెరపై మరోవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతున్నారు నాగబాబు. గతంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలను కూడా నిర్మించి నిర్మాతగానూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

తాజాగా నాగబాబు బాలీవుడ్ ప్రవేశం చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ సాధించి రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయ చిత్రం ‘ఛత్రపతి’. ‘ఛత్రపతి’ సినిమాకు తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రభాస్, రాజమౌళి కెరీర్ లో ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమా మెగా బ్రదర్ నాగబాబు విలన్‌గా నటిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఈ పాత్ర చేయడానికి నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఎమ్మెల్యే బూతులు వింటే చెవిలో రక్తం ఫిక్స్..!

నిరుద్యోగులకు శుభవార్త.. 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..!

ఇక ఇసుక దోపిడీకి చెక్..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్కెచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -