- Advertisement -
ఇసుక దోపిడిని అరికట్టేందుకే.. నూతన విధానాన్ని తెచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీఎమ్డీసీ ద్వారా సరసమైన ధరలకే ఇసుకను విక్రయిస్తున్నామని తెలిపారు. రూ.125 కోట్ల బిడ్ సెక్యూరిటీగా తీసుకుని పారదర్శకంగా టెండర్లు పిలిచామని అన్నారు. ఇసుక విధానంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను మంత్రి కొట్టి పడేశారు.
ఇసుక సరఫరాలో లోపాలుంటే ఎస్ఈబీ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు టోకెన్లు ఇచ్చి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. నదీ తీరంలో రీచ్ల పరిసర గ్రామాల్లో ఉండేవారికి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపారు.
వారంలో నాలుగు రోజుల పాటు టీకాల పంపిణీ : సీఎం జగన్
సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!