బుల్లితెర పై నవ్వులు తెప్పిస్తున్న ప్రోగ్రాం జబర్ధస్త్. ఈ షోకి ఎలాంటి పాపులారిటీ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కామెడీ షోకి ఉన్న ఆదరణను గత రెండు మూడేళ్లుగా మరి యే ఇతర తెలుగు షో కూడా బీట్ చేయలేకపోతోంది. ఇక ఆ షోకు ఎంత పాపులారిటీ ఉందో అంతకంటే ఎక్కుఅవ విమర్శలు కూడా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఇటివలే కాలంలో డబుల్ మీనింగ్ డైలాగులు లేకుందా కామెడీ చేయలేని స్థితికి జబర్ధస్త్ చేరింది. ఇక బుల్లితెర మాటల మాంత్రికుడుగా పేరు గాంచిన హైపర్ ఆది జబర్దస్త్ లో ఒక టీం లీడర్. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన ఆది వేసే పంచ్ లకు నవ్వని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ఆది పంచ్ లను చూసి హీరో నాని అయితే ఆది డైలాగ్స్ చెప్పే టైమింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఉండే ఆది, ప్రస్తుతం జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. యూట్యూబ్ లో వ్యూసే దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
బికాం ఫిజిక్స్, శశికళ, సింధు వాలీ బాల్ ప్లేయర్, స్వతంత్ర దినోత్సవం…ఇలా సోషల్ మీడియా లో ట్రెండ్ అయినా టాపిక్ మీద తన స్టైల్ లో పంచ్లు పేలుస్తాడు హైపర్ ఆది. అయితే రీసెంట్ గా ప్రసారమైన జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో మందుకు సంబందిచి టాపిక్ రాగా మందు వాటర్ కలిపే టప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్టుల్లా బిహేవ్ చేస్తారు అని ఆది డైలాగ్ వేయగానే ఒక్కసారిగా నాగబాబు పడీ పడీ నవ్వగా.. వెంటనే రియాక్ట్ అయిన యాంకర్ అనసూయ బాబుగారు బాగా కనెక్ట్ అయ్యారే.. అని అనడంతో.. ఇక్కడ నూటికి తొంబైశాతం కనెక్ట్ అయ్యారు.. తాగుబోతు సన్నాసుల్లారా.. అంటూ మందుబాబులపై నాగబాబు సెటైర్ వేశారు. దీంతో అక్కడ స్టేజ్పై నవ్వులు అదిరిపోగా చూసిన ప్రేక్షకులు మాత్రం హైపర్ ఆది పంచ్లతో పాటు.. నాగబాబు సెటైర్లకు కూడా తెగ ఎంజాయ్ చేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}888t4SlIjEo{/youtube}
Related