- Advertisement -
మెగా హీరోలంత హీరోయిన్స్ తో ఫారిన్ లోకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వారు ముందే ఫిక్స్ చేసుకున్నారో.. లేక అలా కలిసొచ్చేసిందో గానీ మెగా హీరోలంతా ఇప్పుడు అబ్రాడ్ లో హీరోయిన్స్ తో సాంగ్స్ వేసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తో మొదలుపెడితే కాజల్ తో డ్యూయెట్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు.
పనిలో పనిగా టర్కీలో కూడా ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ తీయనున్నారట. మరోపక్క చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా విన్నర్ మూవీ కోసం ఉక్రెయిన్ లోనే రకుల్ తో రొమాన్స్ చేశాడు. ఇక చిరు తనయుడు ధృవ సాంగ్ కోసం బ్యాంకాక్ లోని క్రాబీ దీవులకి వెళ్లాడు రామ్ చరణ్. అక్కడ రకుల్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇలా మెగా హీరోలు ఫారిన్లో పాటల సందడి చేస్తున్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ ఒక్కడే ప్రస్తుతం షూటింగ్ కి బ్రేకిచ్చాడు. కాలికి దెబ్బ తగలడంతో వరుణ్ తేజ్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు.