Saturday, May 4, 2024
- Advertisement -

సైరా ప్రమోషన్స్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మెగా అభిమానులు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ వంటివి విడుదల చేయడంలో ఏమాత్రం లోటు చేయక పోయినప్పటికీ, సినిమా విడుదలకు ఇంకా కనీసం పది రోజులు కూడా సమయం లేదు కానీ ఇప్పటికీ దర్శకనిర్మాతలు బయటకు వచ్చి సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం మెగా అభిమానులను సైతం నిరాశకు గురిచేస్తోంది. నిర్మాతగా రామ్ చరణ్ ఫెయిల్ అయ్యాడని సినిమాని సరైన విధంగా ప్రమోట్ చేయడం లేదని కొందరు మెగా అభిమానులు చిత్ర బృందం పై మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇలానే విసుగు చెందిన ఒక వీరాభిమాని నిర్మాతలు సినిమాని ఎందుకు సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు అనే విషయాన్ని కనుక్కోవడానికి ముంబై వెళ్ళాడు. ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తున్న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వద్దకు వెళ్లి కూర్చున్నాడు. కొందరు అతన్ని హేళన చేసినప్పటికీ ఈ మెగా అభిమాని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ బిల్డింగ్ ముందు నించుని ఆ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఇదిలా ఉండగా మరి కొందరు సైరా బృందం రాజమౌళిని వంటి దర్శకులను చూసి చాలా నేర్చుకోవాలని, రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడని కానీ సైరా వంటి భారీ బడ్జెట్ సినిమాకి కూడా ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం ఏంటని వాపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -