Thursday, May 2, 2024
- Advertisement -

సినిమా చూసి ఫిదా అయిన చిరు….న‌చ్చిన సీన్ ఏంటో తెలుసా..?

- Advertisement -

మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ఈనెల 9వ విడుద‌ల అయిన మ‌హ‌ర్షి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతోపాటు భారీగా వసూళ్లు వచ్చిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ముఖ్యంగా ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తీసుకున్న కాన్సెప్ట్ అంద‌రికీ బాగా న‌చ్చుతుంది. మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రెటీస్ సినిమా చూసిన త‌ర్వాత ఆనందం ఆపుకోలేక‌పోతున్నారు. ఎవ‌రికి వాళ్లు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు.

ఇక సినిమా చూసిన చిరుకూడా ఫిదా అయిన చిరు స్పందించారు. తాజాగా మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.దిల్ రాజు ఆఫీసులో ప‌టాసులు పేల్చి మ‌రీ ఈ సంబ‌రాలు చేసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే స‌క్సెస్ మీట్‌లో భాగంగానే చిరంజీవి ప్ర‌శంస‌ల గురించి కూడా చెప్పాడు సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్.

ముఖ్యంగా మ‌హేశ్ బాబు న‌ట‌న‌కు ఆయ‌న ఫిదా అయిపోయార‌ని చెప్పాడు దేవీ. దాంతో పాటు సినిమాలో వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ చిరంజీవికి బాగా న‌చ్చేసింద‌ని.. దాని గురించే ఎక్కువ సేపు మాట్లాడ‌ర‌ని మీడియాకు చెప్పాడు దేవీ శ్రీ ప్ర‌సాద్.

త‌మ సినిమా చిరంజీవికి అంత‌గా న‌చ్చినందుకు వంశీ పైడిప‌ల్లి కూడా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.మహర్షి సినిమాకు సంబంధించి తనకు వచ్చిన అన్ని ఫోన్ కాల్స్ లో చిరంజీవి గారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎంతో విశిష్టమైనదని అన్నారు.చిరంజీవి గారి నంబర్ నా వద్ద లేకపోవడంతో ఎవరు చేశారో తెలియక “హలో ఎవరు?” అన్నాను. “నేను చిరంజీవి” అని అవతల నుంచి సమాధానం వచ్చింది. “నేను చిరంజీవి” అన్న మాట వినగానే ఒళ్లు గగుర్పొడిచిన ఫీలింగ్ కలిగిందన్నారు.

చిరంజీవి గారి ఫోన్ కాల్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. చిరంజీవి గారు చివర్లో “వంశీ! ఇదే నా ఫోన్ నంబర్, సేవ్ చేసుకోండి” అనడం నాకు మరింత ప్రత్యేకం?” అంటూ వంశీ పైడిపల్లి తన ఆనందమయ క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -