Saturday, May 4, 2024
- Advertisement -

నాకు కలిసొచ్చిన ఊరు విశాఖపట్నం

- Advertisement -

సినీ, రాజకీయ రంగాల నుంచి స్వచ్చంధంగా తాను రిటైర్ అయితేే మాత్రం విశాఖపట్నంలోనే స్ధిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అభిలాష, ఛాలెంజ్, చంటాబ్బాయ్, ఘరానా మొగుడు చిత్రాలు ఇక్కడే ఎక్కువ ఘూటింగ్ జరుపుకున్నాయని, తనకు ఆ సినిమాలు మంచి హిట్లు ఇచ్చాయని చిరంజీవి చెప్పారు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సరైనోడు ఆడియో ఫంక్షన్ ఆదివారం నాడు విశాఖపట్నంలో జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ విశాఖపట్నం అంటే తనకెంత ఇష్టమో చెప్పారు. ఇక అల్లు అర్జున్ తనకు స్టార్ డమ్ వచ్చినా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడని, అతనికి తెలుగులోనే కాదు.. కన్నడ, కేరళల్లో కూడా అభిమానులున్నారని చెప్పారు.

సరైనోడు చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేడుక విశాఖపట్నంలో నిర్వహించడానికి ప్రధాన కారణం మంత్రి గంటా శ్రీనివాస రావేనని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

{youtube}v=m_ghk3lhIg0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -