Wednesday, May 22, 2024
- Advertisement -

చిరు స్పీడ్ మామూలుగా లేదుగా…సైరాకు గుడ్ బై…

- Advertisement -

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ రూపొందుతోంది. ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇటీవలే డబ్బింగ్ మొదలుపెట్టుకున్న సైరాకు తన వంతు బాధ్యతగా చిరు డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేశారు. ముందుగా చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పేశారు. 20 గంటల్లో చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తిచేయడం గురించి ఫిల్మ్ నగర్లో ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

కమర్షియల్ చిత్రమైతే అది వేరే అనుకోవచ్చు . కానీ సైరా సంగతి వేరు. ప్రతిష్టాత్మక స్వాతంత్ర సమరయోధుడి కథ. సాయి మాధవ్ బుర్ర పరుచూరి బ్రదర్స్ లాంటి లబ్దప్రతిష్టులైన కలాలు దీని కోసం పని చేశాయి అందులోనూ బ్రిటిషర్లను సవాల్ చేసే సీన్స్ లో చాలా పెద్ద పెద్ద సంభాషణలు ఉంటాయి.

సుదీప్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనుండగా, విజయ్ సేతుపతి పాత్రకి మాత్రం వేరొకరితో డబ్బింగ్ చెప్పించనున్నారు. నయనతార కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, ఓ ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేసి, సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఆలోచనలో వున్నారు. జగపతిబాబు బ్రహ్మాజీ తదితరులంతా ఇంకో నెలలో తమ పార్ట్ ని పూర్తి చేస్తారు. మొత్తానికి ఫైనల్ స్టేజి లో సైరా స్పీడ్ అందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -