Sunday, May 12, 2024
- Advertisement -

లైంగిక వేధింపులు.. షాక్‌లో సింగ‌ర్ అభిమానులు..

- Advertisement -

లైంగిక వేధింపులకు గురైన బాధితురాళ్లు ‘మీ టూ’ వేదికగా ఒక్కొక్కరే తమ గళం విప్పుతున్నారు. దీంతో మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు కొనసాగిస్తూనే ఉంది. సినీ సెలబ్రిటీల నుంచి క్రికెట‌ర్ల వ‌ర‌కు మీటూ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.ఊహించని పేర్లు కూడా బయటకురావడం సామాన్య ప్రజలతో పాటు ఇండస్ట్రీ ప్రముఖలనూ విస్మయానికి గురిచేస్తోంది.

దక్షిణాదిలో #మీటూ పోరాటాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన గాయని చిన్మయి తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ బండారం బయటకి రావడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. గాయకుడు కార్తీక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. జర్నలిస్టు‌ సంధ్య మేనన్‌కు మెసేజ్‌ చేశారు. దాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. పోస్ట్ పై ప్రముఖ గాయకురాలు చిన్మయి శ్రీపాద స్పందించారు.

తాను కూడా కార్తీక్ బాధితురాలినే అని పోస్ట్‌ చేశారు. కార్తీక్‌ ఎప్పుడూ తన పాపులారిటీని తప్పుగా ఉపయోగించుకునేవాడని అన్నారు. చాలా మంది అమ్మాయిల వెంటపడేవారని చెప్పారు. కార్తీక్ అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తారని తెలిపారు. మీటూలో ఇంకెంత మంది సెల‌బ్రిటీలు బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -