Tuesday, April 30, 2024
- Advertisement -

పెదవులపై ముద్దుపెట్టాలని కోరాడు : సాయిపల్లవి

- Advertisement -

‘ఫిదా’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో తన నటన, డ్యాన్సులతో మెప్పించింది. ఎలాంటి గ్లామర్ డోస్‌ ఇవ్వకుండా కేవలం తన నటన, డాన్స్‌తోనే ప్రేక్షకుల హృదయంలో గూడు కట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తాజాగా తనకు సంబంధించిన ఓ సీక్రెట్‌ని బయటపెట్టింది.

సినిమాల ఎంపిక, ముద్దు సన్నివేశాల్లో నటించడం మొదలగు విషయాల గురించి ఇటీవల సాయిపల్లవి మాట్లాడుతూ… “ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు. అయితే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశా. ఆ సమయంలో మీటూ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సీన్ చేయమని సదరు దర్శకుడు బలవంత పెట్టలేదు. అలా ‘మీటూ’ కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నాను’ అని సాయిపల్లవి తెలిపింది. అయితే ఆ సినిమా పేరు ఏంటో, ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం ఆ నాచురల్‌ బ్యూటీ గోప్యంగా ఉంచింది.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఒకటి నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ కాగా.. మరోకటి మహా సముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. దీంతో పాటు త‌మిళంలో ‘పావ‌క‌థైగ‌ల్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె న‌టించింది. నాలుగు క‌థ‌లుగా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌ ఒక కథలో సాయి పల్లవి కనిపించనుంది. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ ‌రాజ్ కీలకపాత్రలో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -