Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఛార్మీ, రాశీ,గ‌జాలా..ఈసారి మ‌రింత మ‌సాలా షూరు

- Advertisement -

మ‌రికొన్ని రోజుల‌లో బిగ్‌బాస్ సంద‌డి షూరు కానుంది.బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్ వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఆద్యా న్యూస్ మొద‌టి నుండి చెబుతుందే నిజం అయింది.మొద‌టి సీజ‌న్‌లో ఇమేజ్ త‌క్కువ ఉన్న ఆర్టిస్ట్‌ల‌ను తీసుకువ‌ చ్చి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది బిగ్‌బాస్‌.

ఈసారి అలా జ‌ర‌గ‌కుడ‌ద‌ని కొంచెం ఫేమ‌స్ స్టార్‌ల‌ను తీసుకుంటుంద‌ని మొద‌టి నుండి ఆద్యా న్యూస్ చెబుతునే వ‌స్తుంది.రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది.ఆద్యా న్యూస్ మొద‌ట్లో చెప్పిన‌ట్లుగానే హీరో త‌రుణ్‌,ఆర్యన్ రాజేష్,సింగ‌ర్ గీతా మాధురి,శ్రీరెడ్డిల‌తో పాటు ఫేడ్ అవుట్ అయిపోయిన సీనియ‌ర్ హీరోయిన్లు రాశీ,,ఛార్మీ,గ‌జాలా ఇలాంటి స్టార్స్‌ను తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

ఈ లిస్ట్‌లో ఫేమ‌స్ యాంక‌ర్స్ కూడా ఇద్ద‌రు ఉన్నట్లు తెలుస్తుంది.బిగ్‌బాస్‌-2లో మ‌రింత మ‌సాలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వ‌హాకులు. అయితే, ఈ జాబితాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -