Saturday, May 18, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వార్నింగ్ ఇచ్చిన ఎంపీ క‌విత‌

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎక్క‌డ విన్న విజ‌య్ దేవ‌రకొండ పేరే వినిపిస్తుంది.గ‌తేడాది అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ లాంటి మూవీతో తెలుగు సినిమాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అర్జున్ రెడ్డి సినిమా త‌రువాత తెలుగు సినిమాల‌లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో హిట్ కొట్టాడానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంద‌ని చాలా మంది భావించారు.కాని గీతా గోవిందంతో మ‌రో హిట్‌ను వెంట‌నే త‌న ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

సాధార‌ణ క‌థ‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోశాడు విజ‌య్.అర్జున్ రెడ్డిలో విజ‌య్ చేసిన క్యారెక్ట‌ర్‌కు ,గీతా గోవిందంలో విజ‌య్ చేసిన క్యారెక్ట‌ర్‌కు ఎక్క‌డ పోలికేలే లేవు.అస‌లు అత‌ను ఇలాంటి మూవీ చేస్తాడ‌ని కూడా ఎవ‌రు ఊహించి ఉండ‌రు.ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌రకొండ టైం న‌డుస్తుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.మెగాస్టార్ చిరంజీవి నుంచి బ‌న్నీ వ‌ర‌కు అంద‌రు విజ‌య్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. గీతా గీవిందం సినిమా హిట్ అయిన సంద‌ర్భంగా తాజాగా కేసీఆర్ కుమార్తే ,టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌ ఇటీవలే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిశారు.ఈ సంద‌ర్భంగా ఆమె సినిమా గురించి మాట్లాడుతు విజ‌య్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

పిచ్చి, పిచ్చి సినిమాలు చేయ‌కుండా మంచి సినిమాలు చేస్తు కెరీర్‌ను చ‌క్క‌దిద్దుకోవాలని హిత‌బోద చేశారట క‌విత‌.తెలంగాణ‌కు సంబంధించిన హీరోలు ఇండ‌స్ట్రీలో ఎక్కువుగా లేర‌ని,కాబ‌ట్టి స‌రైన సినిమాలు ఎంచుకుంటు విజ‌యాలు సాధించాల‌ని, ఇండ‌స్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవాల‌ని క్లాస్ పీకారని తెలుస్తుంది.మ‌రి ఎంపీ క‌విత చెప్పిన మాటల‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ ఆచ‌రిస్తాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -