టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్టార్ హీరోలకు స్నేహితుడిగా నటిస్తూనే హీరోగా తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే హీరోగా శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ వంటి సినిమాలు చేశాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. తాజాగా టాలీవుడ్ స్టార్ కెమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గరు మొనగాళ్లు’.
ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సారి శ్రీనివాస్ రెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్ల సమాచారం. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. రిత్విష్ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్గా నటించారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.