అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10నుండీ ప్రారంభమయ్యింది.
నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాని మైత్రీ మూవీమేకర్స్ అందిస్తుంది.
అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సెట్స్ పై అల్లు అర్జున్ ఫొటోను “యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసాడు…!” అంటూ ఓ చిత్రాన్ని రీలీజ్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
చార్మీ కుక్కతో డార్లింగ్ ప్రభాస్ ఫొటో..!
అల్లు అర్జున్ ‘పుష్ప’ లో విలన్ గా తమిళ నటుడు..!