బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈసినిమా కొసం కొంతమంది కథానాయికులను పరీశీలించిగా బాలయ్య పక్కన సరిపోవడం లేదంటూ ప్రచారం జరిగింది. ఇటీవలే భామ ప్రయాగ మార్టిన్ ని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈమేకూడా బాలయ్య పక్కన సరిపోవడం లేదని ఆమెను వద్దనుకున్నట్టు ప్రచారం జరిగింది.
ఇప్పుడు కంచె, మిర్చి లాంటి కుర్రోడు, గుంటూరోడు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్య జైస్వాల్ దాదాపు గా ఎంపికైనట్టు సమాచారం. పస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కొసం ఎదురు చూస్తున్న ప్రగ్య జైస్వాల్ కు బాలకృష్ణ సరసన నటించే అవకాశం దొదికింది.
సింహా, లెజండ్ వంటి హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులలో ఎంతో క్రేజ్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో మరో కథానాయికగా మలయాళ సుందరి పూర్ణను ఇప్పటికే ఎంపికచేసుకున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?