- Advertisement -
హీరో నాగ చైతన్య మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించగా,అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్.ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర హైలెట్ కానుందని సమాచారం.ఈ సినిమాను మారుతి తన స్టైల్ లో తెరకెక్కించారటా!