టాలీవుడ్ లవ్లీ కపూల్ నాగచైతన్య-సమంత ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు.గతంలో వీరిద్దరు కలిసి సినిమాలు చేసిన అవి పెళ్లికి ముందు.నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. పెళ్లి తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా అయ్యారు. పెళ్లి తరువాత వీరిద్దరి కలిసి “నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది.
నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది.గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.సినిమాను సంక్రాతి విడుదల చేయలని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. పెళ్లి తరువాత నాగచైతన్య-సమంత నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=l4I5xx-cvGY