- Advertisement -
అక్కినేని నాగచైతన్య సినిమా సినిమాకు తన నటన నైపుణ్యం పెంచుకుంటున్నాడు.అయితే తాజాగా అతను నటిస్తున్న’సవ్యసాచి సినిమాకు ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ సినిమాను ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 20 లక్షలకి అమ్ముడుపోయాయి అని సమాచారం. ఓవర్సీస్లో నాగచైతన్య మూవీస్లో ఇప్పటి వరుకు ఇదే టాప్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
అలాగే నాగచైతన్య నటిస్తున్న మరో సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 15 లక్షలకు అమ్ముడయ్యాయి.ఈ రకంగా తన సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ రెండు సినిమాలను ఒక నెల గ్యాప్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావలని చైతు ప్లాన్ చేస్తున్నాడు.