రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు పోట్లాడుకునే ఇతివృత్తంతో చలో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర పనిచేసిన వెంకీ కుడముల ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను నాగశౌర్య తల్లిదండ్రులు ఐరా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.
హాస్య ప్రధానంగా రెండు గ్రామాల మధ్య నలిగే సమస్యను దర్శకుడు కథగా తీసుకున్నాడు. తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులో, తమ తమ భాషలు, సినిమాలు, యాసలు, ఇతర వ్యవహారాలపై పట్టుగా ఉండే రెండు వర్గాల మధ్య చిక్కిన ఓ ప్రేమ జంట కథనే సినిమాగా ట్రైలర్ను చూస్తుంటే తెలుస్తోంది. కొన్ని కొన్ని సీన్లు ట్రయిలర్ లో అలా అలా లైట్ గా టచ్ చేసారు. కానీ అవి ఫుల్ లెంగ్త్ చూస్తే కచ్చితంగా ఫన్ సూపర్ గా వుండేలా కనిపిస్తోంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్ గా అవుతుందని ట్రయిలర్ శాంపిల్ చూపించింది.
సినిమాను ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేయనున్నారు. నాగశౌర్య పక్కన హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రస్తుతం నాగశౌర్య తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘కణం’ సినిమా కూడా చేస్తున్నాడు.