‘ఛలో’ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ సినిమా బృందం ఆనందంలో మునిగింది. ఆశించిన దానికన్నా అద్భుత విజయం పొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హాస్యంతో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా యూత్ – ఫ్యామిలీని బాలెన్స్ చేస్తూ సినిమా తెరకెక్కించడంతో సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి స్వయంగా నిర్మాతగా మారారు. కొడుకుకు ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలని భావించి ఖర్చుకు వెనకాడకుండా సినిమాను ఉన్నతంగా నిర్మించారు. ఈ సినిమా ఒకవేళ పోతే నష్టం తామే భరించాలనే ఉద్దేశంతో నైజాం హక్కులు ఆమెనే ఉంచేసుకున్నారు. మిగతా బయర్స్కు చాలా తక్కువ రేటుకు అమ్మేశారు. ఈ సినిమా విజయంతో ఇప్పుడు బయ్యర్సే కాకుండా నాగశౌర్య కుటుంబం ఆనందంలో మునిగింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు స్థాయిలో లాభాలు వచ్చాయి.
ఇంతటి విజయం అందించిన వెంకీ కుడుములకు ఇటీవల చిత్ర నిర్మాత, శౌర్య తల్లి కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు తన కొడుకు నాగశౌర్యకు మంచి కాస్ట్ లీ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కారు దాదాపు రూ. కోటి ధర ఉంది. పొర్షి కెమన్ 718 కారును తల్లి బహుమతిగా ఇవ్వడంతో శౌర్య ఆనందంలో మునిగాడు. కార్లంటే మొదటి నుంచి శౌర్యకు ఇష్టం ఉండడంతో పైగా తనకు ఇష్టమైన కారు ఇవ్వడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు.ప్రస్తుతం నాగశౌర్య కొత్త సినిమా ‘కణం’ వచ్చే నెల విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా థ్రిల్లర్ తరహాలో రూపొందుతోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.