Monday, May 6, 2024
- Advertisement -

‘జబర్దస్త్ షో’పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పేరు చెప్ప‌గానే మొద‌టిగా గుర్తుకు వ‌చ్చేది ప్ర‌ముఖ ఈటీవీ ఛానెల్లో ప్ర‌సార‌మ‌య్యే ‘జ‌బ‌ర్థ‌స్త్‌’. గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా ప్ర‌సార‌మ‌వుతున్న ‘జబర్దస్త్’ ప్రొగ్రామ్‌కు జ‌డ్జీగా వ్య‌వ‌హారిస్తున్నాడు నాగ‌బాబు. ఆయ‌న‌తో పాటు క‌లిసి న‌టి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు. అయితే గ‌త రెండు , మూడు వారాలుగా వీరు జబర్దస్త్ షోలో క‌నిపించ‌డం లేదు.

రోజా వైసీపీ పార్టీ త‌రుపున న‌గ‌రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె ఎన్నిక‌ల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల జబర్దస్త్ షోకి రాలేక‌పోయారు. ఇక నాగ‌బాబు కూడా త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ నుంచి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేశారు. దీంతో ఈయ‌న కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఈ షోకి రాలేక‌పోయారు. నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశారు. ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో అభ్య‌ర్ధులు అంద‌రు కాస్తా రిలాక్స్ అవుతున్నారు.

తాజాగా నాగ‌బాబు త‌న యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతు… తాను గెలిచిన , ఓడిన జబర్దస్త్ షో మాత్రం వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని తెలిపారు.నెలకి నాలుగైదు రోజు షో కోసం సమయం కేటాయిస్తే సరిపోతుందని, దాని కారణంగా తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదని అన్నారు. రోజా, నాగబాబు స్థానంలో నటి మీనా, శేఖర్ మాస్టర్‌లను జ‌డ్జీలుగా తీసుకువ‌చ్చారు జబర్దస్త్ షో యాజ‌మాన్యం. నాగ‌బాబు వ్యాఖ్య‌ల బ‌ట్టి మ‌రికొద్ది రోజుల్లో నాగ‌బాబు జ‌బ‌ర్థ‌స్త్ షోలో క‌నిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -