సమంత నటించిన యు టర్న్ మూవీ రేపు(గురువారం)ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈసందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం గా నాగ్ మాట్లాడుతూ ‘రేపు రిలీజ్ అవుతున్నసమంత యు టర్న్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. సమంత నటించిన మరో తమిళ సినిమా కూడా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడే సమంతను అడుగుతున్నా గిన్నీస్ బుక్లో రికార్డ్ కోసం ట్రై చేస్తున్నావా.. ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నావా ఏంటీ అని నాగ్ సమంతని సరదాగా ఆటపట్టించారు.సమంత యు టర్న్తో పాటు నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు కూడా రేపే విడుదల కానుంది.నాగర్జున నటించిన దేవదాస్ సినిమా కూడా ఈ నెల 27న విడుదల కానుంది.అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురి సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం విశేషంగానే చెప్పుకోవాలి.