- Advertisement -
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు.అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ను మొదలపెట్టనుంది.
దీనిలో భాగంగానే భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.సెప్టెంబర్9న నిర్వహించనున్న ఈ వేడుకకు దేవదాస్లు నాగార్జున, నానిలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.