Thursday, May 16, 2024
- Advertisement -

‘మన్మధుడు’ లో అలా.. ‘మన్మధుడు 2’ లో ఇలా..

- Advertisement -

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు’ సినిమా సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘మన్మధుడు 2’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. మొదటి భాగంలో అమ్మాయిలంటే పడని పాత్రలో కనిపించిన నాగార్జున ఈ సినిమాలో మాత్రం ప్లే బోయ్ తరహా పాత్ర లో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘మన్మధుడు’ సినిమాలో యాడ్ కంపెనీ కి యజమాని పాత్ర పోషించిన నాగార్జున ఈ సినిమాలో మాత్రం ఒక పెర్ఫ్యూమ్ కంపెనీకి యజమానిగా కనిపించబోతున్నారట.

అంతేకాకుండా ‘మన్మధుడు’ సినిమా తో పోలిస్తే ‘మన్మధుడు2’ సినిమాలో రొమాన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం. కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది. ‘మన్మధుడు’ సినిమా లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -