Saturday, May 11, 2024
- Advertisement -

బాహుబలితో సాహసం చేస్తున్న సినీ హీరో నాగార్జున

- Advertisement -

ఇప్పుడు సినీ హీరో నాగార్జున కూడా బాహుబలి సినిమాతో పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా మారిపోయాడు. అది ఎలా అంటే అత్యంత భారీ తారాగణంతో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి ద్వారా. ఈ చిత్రం బిజినెస్ భారీగా జరుగుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలోనే ఎన్నడూ లేని విధంగా భారీ వసూళ్ళు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా హక్కుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అందులో సినీ రంగ ప్రముఖులు కూడా భేర సారాలు జరుపుతున్నారని, సినీ హీరో నాగార్జున కూడా ఈ చిత్రానికి సంబందించి కృష్ణా జిల్లా హక్కులు 3.69 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి బాహుబలి చిత్రాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా బిజినెస్ జరిగిందని సమాచారం. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుపాటి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, హంసానందిని, కీరవాణి సంగీతం, ఇలా భారీ తారాగణంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 10న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -