తెలుగులో కూడా ఎన్నడు లేని విధంగా కొంత మంది కొత్త భామలు సీనియర్ హీరోయిన్స్ ని తెగ డామినేట్ చేస్తున్నారు. మన హీరోలు కూడా చేసిన హీరోయిన్లతో మళ్లీ చేయడం లేదు.కుర్ర హీరోలు అయితే మరి చేసిన భామలతో చేయకుండా కొత్త హీరోయిన్ల కోసం క్యూ కడుతున్నరు.స్క్రీన్ ఫ్రెష్నెస్ కోసం దర్శక నిర్మాతలు కూడా కొత్త వారికే ఓటు వేస్తున్నారు.
నాని ఇటీవల కిషోర్ తీరుమలతో ఓ కథను ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాని మళ్లీ మళయాళ బ్యూటీనే తీసుకోవాలని దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. నాని పరిచయం చేసిన హీరోయిన్స్ టాప్ పోజిషన్లో ఉన్నారు. నివేత థామస్, అను ఇమ్మాన్యుయేల్ ను టాలీవుడ్కు పరిచయం చేసింది నానినే.
కిషోర్ తీరుమల కూడా మల్లు గర్ల్ కీర్తిని నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా మరో మల్లు గర్ల్ పై కన్నేసినట్లు సమాచారం. ఓ ఇద్దరు లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తారట. ఇక సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.