అష్టా చమ్మా’ తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జెంటిల్మన్ అనే పేరు పెట్టారు. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తయింది కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచారు.ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే అంశాలు. ఆహ్లాదకరమైన రొమాన్స్, సెంటిమెంట్, వినోదం తగిన మోతాదులో కలగలిసి విధంగా ఈ చిత్రం ఉంటుందట.
మణిశర్మ మంచి సంగీతాన్నిచ్చారు. పాటల విడుదల తేదీని త్వరలోనే విడుదల కానున్నాయి. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, ‘సత్యం’ రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు. ఈ రోజే ఈ సినిమాకి సంబందించి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి స్పందన వస్తుంది.
{youtube}v=pr6MRAZYRz4{/youtube}