Sunday, May 5, 2024
- Advertisement -

‘ఆటగాళ్లు’ పూర్త‌య్యింది.. ఇక అస‌లు ఆట థియేట‌ర్‌లోనే..

- Advertisement -

‘ఆటగాళ్లు’ సినిమా షూట్ పూర్త‌యి ఇక థియేట‌ర్‌లో ఆట ఆడ‌డానికి న‌టుడు నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌త అక్టోబ‌ర్‌లో మొద‌లైన ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ఈ నెల‌తో పూర్త‌య్యింది. ‘అధినాయకుడు’ ద‌ర్శ‌కుడు పరుచూరి మురళీ మ‌ళ్లీ ‘ఆటగాళ్లు’ సినిమాతో ద‌ర్శ‌కత్వం బాట ప‌ట్టారు.

నారా రోహిత్, జగపతిబాబు కాంబినేషన్‌లో ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకోనుంది. ఈ వేసవిలోనే ‘ఆటగాళ్లు’ సినిమాను విడుద‌ల చేయాల‌ని సినీ బృందం ప్లాన్‌. ఈ సినిమాలో జగపతిబాబు క్రిమినల్ లాయర్ పాత్ర‌లో, నారా రోహిత్ సినిమా దర్శకుడిగా కనిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

వీరి మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందించారు. రామోజీ ఫిలిం సిటీలో తక్కువ రోజుల్లో.. తక్కువ బడ్జెట్లోనే సినిమా షూట్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రోహిత్‌, జ‌గ‌ప‌తిబాబు త‌మ త‌మ సినిమాల‌తో బిజీ అవుతారు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబు రంగ‌స్థ‌లంలో న‌టించ‌గా రోహిత్ వెంక‌టేశ్ ప‌క్క‌న సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -