Wednesday, April 24, 2024
- Advertisement -

నేను ఇక్కడే ఫుల్ బిజీ.. బాలీవుడ్ కు రాలేను: నవీన్ పోలిశెట్టి

- Advertisement -

తాజాగా కె.వి అనుదీప్ దర్శకత్వంలో కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందించిన సినిమా “జాతిరత్నాలు” ఈ మూవీలో నవీన్ పోలిశెట్ట, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో హీరో స్నేహితులుగా ప్రధానపాత్రల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో తన కెరీర్‌ని ప్రారంభించిన నవీన్ పొలిశెట్టి తర్వాత “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో ‘చిచోరే’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.యాసిడ్ పేరుతో రూపొందిన ఈ పాత్రలోనూ నవీన్‌కి మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో జాతి రత్నాలు మూవీ చేయడంతో ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

Also read:అమ్మ కోసమే పుట్టిన అద్భుత పాటలు.. వింటే మైమర్చిపోతారు!

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అదే తరుణంలో బాలీవుడ్ నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయట కాకపోతే ఇప్పటికే టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తుండడంతో బిజీ షెడ్యూల్ కారణంగా బాలీవుడ్ సినిమాలకు కమిట్ కాలేక పోతున్నాడట ఈ యువ హీరో.

Also read:బాలకృష్ణ సరసన ఆ బ్యూటీ.. సినిమాలో కీలక పాత్ర!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -