Sunday, April 28, 2024
- Advertisement -

బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!

- Advertisement -

సాధారణంగా వెండితెరపై నటీనటుల పాత్ర ఎంతో కీలకమైనది. అదేవిధంగా బుల్లితెరపై కూడా యాంకర్ ల పాత్ర అంతే కీలకమైనది. ఈ క్రమంలోనే ఎంతోమంది బుల్లితెర యాంకర్లు కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా నటించే అవకాశాలను పొందారు. ఇదిలా ఉండగా ఒకప్పటి రియాలిటీ షో నుంచి ఇప్పటివరకు బుల్లితెరపై యాంకర్ గా వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను దోచుకున్న ఆ స్టార్ యాంకర్ లు ఎవరో, వారి కెరీర్ లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • సుమ: ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనం బుల్లితెరపై ఏ ఛానల్ పెట్టిన మనకు సుమ కనిపిస్తారు. ఇప్పటికే ఎన్నో టీవీ కార్యక్రమాలను చేసిన సుమకు స్టార్ మహిళ, క్యాష్, భలే ఛాన్స్ వంటి ప్రోగ్రామ్ల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
  • ఝాన్సీ: ఒకప్పుడు యాంకర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ఆ తర్వాత సినిమాలలో సందడి చేశారు. ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన ఝాన్సీ ఏటీఎం, సండే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, సరదా, వర్షం, వంటి కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Also read:నాకు నచ్చిన బ్యాగ్‌ ధర జస్ట్‌ రూ.30 వేలే: సమంత

  • అనసూయ: ప్రస్తుతం ఉన్న గ్లామరస్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం అనసూయకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం సినిమాలలో అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు.
  • శ్రీముఖి: బుల్లితెర మరో గ్లామర్ యాంకర్ శ్రీముఖి అని చెప్పవచ్చు. బుల్లితెరపై ఎంతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీముఖికి పటాస్ కార్యక్రమం ఎంతో గుర్తింపును తెచ్చింది.

*ఉదయభాను: తెలంగాణ యాసతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదయభాను టీవీ కార్యక్రమాల ద్వారా అందరినీ మెప్పించింది.వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రాం, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను, ఢీ షో లతో యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంది.

Also read:ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -