Sunday, May 19, 2024
- Advertisement -

ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం

- Advertisement -

నయనతార. అందాల ఆరబోయడంలో వెనుకడుగు వేయని తార. ఇప్పటి వరకూ అన్ని పాత్రల్లోనూ చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది ఇప్పుడు హర్రర్ చిత్రంలో నటించబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ చిత్రానికి మురుగదాస్ రామస్వామి దర్శకుడు.

సురక్ష ఎంటర్ టైన్ మెంట్స్న్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మయూరి చిత్రం తర్వాత నయనతార నటిస్తున్న లేడీ ఓరియంటెండ్ హర్రర్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన హర్రర్ చిత్రాలకు భిన్నంగా దీన్ని తీయనున్నారు. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగిస్తుందని చిత్ర నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో ఇతర పాత్రలు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -