మంచి పాత్రలతో పలు సినిమాల్లో మెరుస్తూ హీరోగా కూడా శ్రీవిష్ణు దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీ విష్ణు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు. వినూత్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ‘నీది నాదీ ఒకే కథ’ అనే ఆ కథ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటోంది.
`పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు.. జనుల పుత్రుడి కనుగొని పొగడగా పుత్రోత్సహంబు నాడు పొందుర సుమతి.. అంటూ చిన్నప్పుడు విన్న పద్యంతో టీజర్ మొదలైంది. ఈ ఒక్క లైన్తో దర్శకుడు వేణు టీజర్ను విడుదల చేశారు. శ్రీ విష్ణు ఈసారి రాయలసీమ యాసలో కొత్తగా కనిపిస్తున్నాడు. చదువు రాని యువకుడు.. చదువు వల్ల ఒత్తిడి గురయ్యే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు.
ఇక చివరలో వచ్చిన డైలాగ్ కొబ్బరి బోండలోడిది బతుకు కాదా.. ఇంజనీర్, డాక్టర్లు, మీ లెక్చరర్లదే బతుకా? అని ప్రశ్నిస్తూ తండ్రితో చెంపదెబ్బ తిన్న పాత్రలో శ్రీవిష్ణు భావోద్వేగాలు పలికిస్తున్నాడు. త్వరలో మిగిలిన పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా ట్రైలర్ని రిలీజ్ చేస్తారట. ఇక సినిమాను నారా రోహిత్ నిర్మిస్తుండగా వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. బిచ్చగాడు సినిమా శాట్నా టైటస్ హీరోయిన్గా నటిస్తోంది.