రెండు రోజుల క్రితం విడుదలైన నేను C/o నువ్వు సినిమా ట్రైలర్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతోంది. అగ్ర కులానికి చెందిన అమ్మాయి దళితులను ప్రేమిస్తే ఎలా ఉంటుందనే అంశం ప్రధానంగా తీసుకుని తెరకెక్కించారు ఈ సినిమా. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ను విమర్శిస్తున్నారు. దళితులను కించపరిచే విధాంగా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయని అంటూ మండిపడుతున్నారు. అసలు ఈ ట్రైలర్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేశారు అంటూ సినీ అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ట్రైలర్ను యూట్యూబ్ నుంచి తొలగించారు.
కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.కొందరు ఈ ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ,ట్రైలర్ వైరల్గా మారింది. దీంతో చిత్ర దర్శకుడితో పాటు నిర్మాత కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకుడు తుమ్మ సగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుల పిచ్చితో సినిమాను తెరకెక్కించలేదని, ఓ యదార్థ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకుని ,సినిమాకు కావాల్సిన అంశాలను జత చేసి నేను C/o నువ్వు సినిమాను తీశామని అంతే కాని ,ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసుకుని సినిమాను తీయలేదని తెలిపాడు చిత్ర దర్శకుడు.
మా సినిమా ట్రైలర్ వల్లన ఎవరైన బాధపడి ఉంటే క్షమించమని కోరారు చిత్ర నిర్మాత. మరి విడుదలకు ముందే ఇన్ని వివాదాలు సృష్టించిన ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా అనే అనుమానం అందరిలోను ఉంది.
- Advertisement -
కుల పిచ్చితో సినిమాను తీయలేదు – నేను C/o నువ్వు చిత్ర దర్శకుడు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -