Sunday, May 5, 2024
- Advertisement -

జీవిత కామెంట్స్ ని ఎగతాళి చేస్తున్న నెటిజన్లు

- Advertisement -

ప్రముఖ నటి మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) సెక్రెటరీ అయిన జీవిత రాజశేఖర్ ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు మరియు నిర్మాతలు పర బాషా హీరోయిన్లకంటే తెలుగు లోకల్ హీరోయిన్లను ఎంపిక చేసుకోమని చెబుతున్నారు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అభిమానులు మండిపడుతున్నారు. ఇన్ని కబుర్లు చెప్పి మరి ఆమె చేస్తుంది ఏంటి అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. జీవిత నిర్మాతగా ‘పిఎస్వీ గరుడవేగా’, ‘కల్కి’ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలలో చూస్తే కిషోర్, అశుతోష్ రానా, అదా శర్మ, పూజ కుమార్ తదితర పర బాషా నటులు ఈ చిత్రాలలో ముఖ్యపాత్రలు పోషించారు. ఆమె మాత్రం పరభాషా నటులను సినిమాలోకి తీసుకుని మిగతా నిర్మాతలకు మాత్రం తెలుగు హీరోయిన్లను మాత్రమే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కొందరు చెబుతున్నారు. మరోవైపు తెలుగులో ఇప్పటికే ‘బాహుబలి’, ‘సాహో’, ‘సై రా నరసింహ రెడ్డి’ వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సినిమాలలో కూడా పరభాషా నటులు ఎక్కువమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాగాలేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -