మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైన ప్రకటన రాకున్నా ఇప్పటికే హడావుడి మొదలైంది. నిజానికి కరోనా లేకపోతే.. సెప్టెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సారి ఎన్నికల కంటే చాలా ముందే హడావుడి మొదలైంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ సారి బరిలో ఉండబోతున్నారు. ఆయనకు మెగా క్యాంప్ మద్దతు ఇస్తోంది. మరోవైపు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు తదితరులు సైతం పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రకాశ్రాజ్ అందరికంటే ముందే ఎన్నికలకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే తన ప్యానెల్ను కూడా ప్రకటించారు. మా ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడంటూ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్కు ట్వీట్లు కూడా చేశారు.ఇక మంచు విష్ణు సైతం నిత్యం మీడియాతో టచ్లో ఉంటూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాడు. మంచు విష్ణుకు.. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, నందమూరి ఫ్యామిలీ మద్దతుగా నిలుస్తోందని టాక్.
మా ఎన్నికలపై హడావుడి జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే త్వరలో మా ఈసీ( ఎగ్జిక్యుటివ్ కమిటీ) సమావేశం కాబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ మీటింగ్ జరిగే చాన్స్ ఉంది. ఎన్నికల విషయంలో ఈ సమావేశంలో ఏదో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇటీవల నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కోసం ఇప్పటివరకు ఒక్క భవనం కూడా లేదని.. సినీ పెద్దలు ఏం చేస్తున్నారంటూ ఆయన దుయ్య బట్టారు. ఈ విషయంపై మెగా శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఇక మంచు విష్ణు సైతం అప్పుడప్పుడు టీవీ చానల్స్లో చర్చల్లో పాల్గొంటూ హీట్ రాజేస్తున్నాడు. ఇక ప్రకాశ్ రాజ్ మద్దతు కూడగట్టుకొనే పనిలో పడ్డారు. మెగా క్యాంపు మొత్తం ఆయన వెంటే ఉండటంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు.
Also Read
స్పెషల్ సాంగ్కోసం సన్నీ లియోన్ రెమ్యునరేషన్ ఎంతంటే?