మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకున్నది. 2021 మార్చితో మా పదవీకాలం ముగిసిపోయింది. అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఎన్నికలు జరగడం లేదు. మా ఎన్నికల్లో పోటీచేయబోతున్నానంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. తన ప్యానెల్ను కూడా ప్రకటించేశారు. కానీ ఎన్నికల నిర్వహణ విషయంపై మా అధ్యక్షుడు నరేశ్ క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ప్రకాష్ రాజ్ ట్వీట్లు కూడా చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని మా అధ్యక్షుడు నరేశ్ ట్విట్టర్లోనే బదులిచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. మా అసోసియేషన్లో ఉన్న 15 మంది సభ్యులు (ఈసీ) క్రమశిక్షణాసంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుతం మా పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు ఆ లేఖలో కోరారు.
అయితే ఇప్పటికే మా లో ఉన్న పలువురు సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానెల్లో చేరిపోయారు. తాజాగా 15 మంది సభ్యులు లేఖ రాయడం తీవ్ర కలకలంగా మారింది. ఈ విషయంపై మా అధ్యక్షుడు నరేశ్ ఎలా స్పందిస్తారో? వేచి చూడాలి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంపై నరేశ్ ఎలా స్పందిస్తారో? వేచి చూడాలి.
Also Read
రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!