Saturday, April 20, 2024
- Advertisement -

మళ్ళీ చిన్మయి ని ట్రాల్ చేసిన నెటిజన్స్

- Advertisement -

సమంత కి డబ్బింగ్ చెప్తూ బాగా పాపులర్ అయినా గాయని చిన్మయి. రాహుల్ రవీంద్రన్ ని పెళ్ళి చేసుకొని అటు తెలుగు, తమిళ భాషల్లో బాగా బిజీ గా గడుపుతున్న ఆర్టిస్ట్ చిన్మయి. అయితే ఇటీవలే కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ ని వక్రీకరిస్తూ తమకి నచ్చిన విధం గా తమ సొంత అర్ధాలని తీసుకొని కాస్త సోషల్ మీడియా లో హడావుడి చేసిన ఫెమినిస్ట్స్ చాలా మందే ఉన్నారు. చిన్మయి కూడా కాంటెక్స్ట్ ని మర్చిపోయి తనకి అభ్యంతరకరం గా ఉన్న విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడటం వలన చిన్మయి ని చాలా మంది ట్రోల్ చేశారు.

అయితే అది మరువక ముందే ఇప్పుడు కొత్తగా చిన్మయి ని మళ్ళీ ట్రోల్ చేశారు నెటిజన్స్. అబ్యూస్ గురించి, చిన్న పిల్లల మీద అబ్యూస్ గురించి చెప్తూ చిన్మయి కొంత మంది తో వాదన కి దిగింది. అప్పుడు వాళ్ళు, 3-4 ఏళ్ళ పిల్లాడు తినను అని చెప్పి మారం చేస్తే ఒకటి రెండు దెబ్బలు వేసి తినిపిస్తారా లేదా అంటే, చిన్మయి దానికి సమాధానం గా దెబ్బలు కొట్టేది లేదు, ఆ పిల్లలకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే తింటారు అని చెప్పింది.

సాధారణం గా ఆ వయసు పిల్లలకి ఎప్పుడు తినాలి, ఏం తినాలి అని ఆలోచించేంత మేధస్సు ఉండదు కాబట్టి తల్లిదండ్రులు టైం కి పెడుతూ, తినకపోతే నాలుగు తగిలించైనా తినిపిస్తారు. కానీ చిన్మయి మాత్రం అందుకు విరుద్ధం అని చెప్పడం తో, అది అసాధ్యం అని ఆమె ని ట్రోల్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -