Tuesday, May 21, 2024
- Advertisement -

ప‌బ్లిసిటీ కోసం పూజా హెగ్డే ఇంత ప‌నిచేసిందా….

- Advertisement -

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రంగ‌స్థ‌లం ఫివ‌ర్ కొన‌సాగుతోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ , సంమంతా జంట‌గా న‌టిస్తున్న పొలిటిక‌ల్ డ్రామా సినిమాకు పూజా మెగ్డే జిగేల్ రాణి ఐట‌మ్ సాంగ్ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం రేపుతోంది. ఎక్క‌డా ఎవ‌రి నోట మాట విన్నా రంగ‌స్థ‌లం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాల మ‌ధ్య రేపు విడుద‌ల కానుంది.

అయితే ఈ సాంగే పూజాహెగ్డేకు శాపంగా మారింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందని, తాను వెళ్లి తన సాంగ్ ప్రోమోను చూపిస్తే అమ్మమ్మ లేచి డ్యాన్స్ చేసిందంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. నా జిగేలురాణి ప్రోమో చూసిన వెంటనే తనకు చాలా సంతోషం వేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అది ఆమెకు చాలా ఎనర్జీనిచ్చింది అంటూ పూజా పోస్ట్ చేసింది. ప‌బ్లిసిటీ కోసం ఇంత ప‌నికి ఒడిగ‌ట్టిందా అని నెటిజ‌న్లు నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు పూజా చేసిన పనికి తిట్లు దండ‌కం అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -