- Advertisement -
సర్కారు వారి పాట సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.
తాజాగా ఈ మూవీపై మహేశ్ బాబు తండ్రి కృష్ణ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. పోకిరి, దూకుడు కంటే ఈ మూవీ చాలా బాగుందని ప్రశంసించారు. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందన్నారు.
అయితే ఒక ఛానల్ వారు మాత్రం కావాలనే సినిమా బాగోలేదంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. సర్కారు వారి పాటకు పరుశురామ్ దర్శకత్వం వహించారు.
నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు