నిధి అగర్వాల్ ..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కాని బాలీవుడ్ జనాలకు ఈ పేరు సుపరిచితమే.బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించింది నిధి అగర్వాల్.దీంతో టాలీవుడ్లో కూడా తన లక్ను చెక్ చేసుకోవడానికి వస్తుంది.నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది నిధి అగర్వాల్. ఇంకా ఆమె చేసిన సినిమాలేవి విడుదల కాకముందే మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది నిధి.ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇన్స్టాగ్రమ్లో ఈ హీరోయిన్కి ఏకంగా రెండు మిలియన్ల మందికి పైనే ఫాలోయర్లు ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి.తెలుగులో మొదటి సినిమా విడుదల కాక ముందే రెండో సినిమాకు సైన్ చేసింది నిధి.అఖిల్ హీరోగా రూపొందబోయే సినిమాలో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందే సినిమాలో నిధి హీరోయిన్గా నటించనుందని సమాచారం. తాజాగా ఆమె ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.పెట్టిన కొన్ని క్షణల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.