Tuesday, May 21, 2024
- Advertisement -

నిహారిక సినిమాని కోసి పడేసారు

- Advertisement -

మెగా ఫాన్స్ కి విపరీతమైన అంచనాలు రేపుతూ నిన్న విడుదల అయిన ఒక మనసు సినిమా మిక్స్ టాక్ తో నడుస్తోంది. మెగా ప్రిన్సెస్ నిహారిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా లో నాగ్ శౌర్య హీరోగా చెయ్యగా మల్లెల తీరం లో సిరిమల్లె పువ్వు సినిమా డైరెక్టర్ రామరాజు ఈ సినిమాని తెరకి ఎక్కించాడు.

మొదటి సారి హీరోయిన్ గా పరిచయం అయిన నిహారిక మంచి మార్కులే కొట్టేసినా సినిమా మాత్రం చాలా యావరేజ్ టాక్ తో నడుస్తోంది. స్వచ్చమైన ప్రేమ కథ అంటూ డైరెక్టర్ సినిమాని బాగా సాగాదేసాడు అనే టాక్ వినిపిస్తోంది. విజువల్స్ కీ పాటలకీ పేరు వచ్చినా కూడా నిడివి , డ్రాగింగ్ సీన్ ల విషయం లో ప్రేక్షకులు అస్సలు హ్యాపీగా లేనే లేరు.

దీంతో ఈ సినిమాని ట్రిమ్ చెయ్యాల్సిందే అని ఫిక్స్ అయిన చిత్ర బృందం అంత పనీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన టీమ్ దాదాపు 15 నిమిషాల నిడివిని కత్తిరించింది. ఫస్టాఫ్‌లో కథ గమనాన్ని ఎఫెక్ట్ చేయని ఓ పావుగంట సన్నివేశాలకు కత్తెర వేశారు. ఈరోజు నుంచి అన్నిథియేటర్లలో ఈ లేటెస్ట్ కట్ వర్షన్ ప్రదర్శితం కానుంది. ఈ చర్యతో సినిమా మళ్ళీ ఊపందుకుంటుందని టీమ్ భావిస్తోంది. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాలో నాగ శౌర్య, నిహారికల నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -