గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక కొణిదెల ఇప్పుడు బిగ్ స్క్రీన్పై రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో నిహారిక కొన్ని యూట్యూబ్ సిరీస్లు, జబర్దస్త్ వంటి కామెడీ టీవీ ప్రోగ్రామ్లు మరియు ఢీ వంటి డ్యాన్స్ ప్రోగ్రామ్లలో నటించింది. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసిన నిహారిక కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి కారణంగా ఇండస్ట్రీకి దూరమైంది.
ఆయితే నిహారిక ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం చేయబడిన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. నిహారిక విడాకులు తీసుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కాని దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. అయితే నిహారిక మళ్లీ సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో నటించడానికి సిద్ద సిద్ధమవుతున్నట్లు సమాచారం. మన కున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమాలో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోందని, ఈ ప్రాజెక్ట్ కు సంబందిచిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
నిహారిక కొణిదెల డెడ్ పిక్సెల్స్ పేరుతో కామెడీ డ్రామా సిరీస్ చేసింది, దీనికి కొన్ని వర్గాల ప్రేక్షకుల నుండి కొంత ప్రతికూల స్పందన వచ్చింది. నెటిజన్లు వెబ్ సిరీస్లో కొంచెం బోల్డ్ కంటెంట్ను భరించలేక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు మరి కొందరు. నిహారిక కొన్ని పెద్దల డైలాగ్లను కలిగి ఉన్న పాత్రలో నటించింది, అభిమానులు ఆమెకు అనవసరంగా భావించారు. బోల్డ్ కంటెంట్ను వదిలివేస్తే, సిరీస్లో సరైన కంటెంట్ లేదు, అందుకే వీక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది.
Also Read