సినీ ఇండస్ట్రీలో మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించిన నిక్కీ తంబోలి “చీకటి గదిలో చితక్కొట్టుడు” అనే హర్రర్ కామెడీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తరువాత వరుసగా “కాంచన 3 , తిప్పరా మీసం వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్14లో ఒక కంటెస్టెంట్గా పాల్గొన్న హీరోయిన్ నిక్కీ తంబోలి ఆ షో లో రెండవ రన్నరప్గా నిలిచి ఇండస్ట్రీలో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవల ఈమె తీసుకున్న నిర్ణయంపై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విషయం ఏమిటంటే..
ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ నిక్కీ తంబోలి కి కరోనా సోకింది. వెంటనే స్వీయనిర్భందంలోకి వెళ్లి చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకుంది.ఈ నేపథ్యంలో కొవిడ్-19తో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేస్తానని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానాని. నా బ్లడ్ గ్రూప్ ‘O+’ అని తెలిపింది.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేస్తే దాని వల్ల కరోనా కారణంగా బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది. మీరు కూడా ఎలాంటి భయం లేకుండా కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరు తమ ప్లాస్మాను దానం చేయాలని నటి నిక్కీ తంబోలి కోరింది.దీంతో నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.