Wednesday, May 8, 2024
- Advertisement -

ఛార్మిని కోర్టుకు లాగుతా అంటున్న నిర్మాత?

- Advertisement -

ఛార్మి-నితిన్-పూరి వీరి మద్య రగిలిన వివాదం అప్పుడే సమసిపోయేలా లేదు. రోజూకో వార్త ఫిల్మ నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఒకవైపు ఛార్మి డబ్బుల్లేక నితిన్ పూరి సినిమా ఆగిపోయిందని ఈ వివాదంలోకి తనను అనవసరంగా లాగారని ఆమె వాపోయింది. 

కొద్ది రొజుల క్రితం మొదటి సినిమా చేయడం వల్ల నితిన్, పూరి సినిమాకు నిర్మాతగా చేయటానికి వెనుకంజ వేశారని ఆమె పేర్కొంది. అందుకే పూరి జగన్నాథ్ మరో హోరోతో, నిర్మాత తో సినిమా చేయడానికి సిద్దమయ్యారని ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. మహిళను కాబట్టి నన్ను టార్గెట్ చేసి బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 

నిజానికి నితిన్‌కు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో, లేవో తెలుసుకోకుండా,  ఉన్నాయని చెప్పినందుకు సిన్సియర్‌గా క్షమాపన చెబుతున్నా అని తన ట్విట్టర్‌లో కూడా పోస్ట్‌చేసింది. కాని ఈ క్షమాపణ నితిన్‌, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ని సంతృప్తి పరచలేదు. ఛార్మి బాధ్యతారహితమైన ఆరోపణలు చేసిందని ఆమెపై యాక్షన్ తీసుకోవాలని తెలుగు నిర్మాతల మండలిలో పిర్యాదు చేశారు. ఇంకా ఛార్మిపై లీగల్ గా ముందుకు వెళ్తామని సూచించారు. ఈ వివాదం ఇంకా ఎంత దూరం పోతుందో అని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -